కోనసీమ జిల్లా మకిలిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం రేపుతోంది. గ్యాస్ లీకైన ప్రాంతంలో మంటలు భారీగా ఎగసిపడుతూ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇళ్లను ఇప్పటికే ఖాళీ చేయించారు. ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇరుసుమండ గ్రామంలోని 300 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు కోనసీమ జిల్లా కలెక్టర్ ఘటనాస్థలిని పరిశీలించారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని.. 24 గంటలు గడిస్తే కానీ.. ఏ విషయాన్ని చెప్పలేమని కలెక్టర్ ప్రకటించారు.