కృష్ణా జిల్లాలో ఓ వృద్ధ తండ్రి పట్ల కొడుకు దారుణంగా ప్రవర్తించాడు. నందివాడ మండలం పుట్టగుంటకు చెందిన సత్యనారాయణరెడ్డిని ఆయన కుమారుడు విశ్వనాథవరప్రసాద్ రెడ్డి ఇంట్లో నుండి గెంటివేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆయన కలెక్టరేట్ కార్యాలయం గడప తొక్కాడు. కలెక్టర్ బాలాజీ స్పందించి, కుమారుడిని మందలించి తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ చొరవతో వృద్ధుడు తన కుమారుడితో తిరిగి ఇంటికి చేరుకున్నాడు.