KTR: మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన ఆరోపణలు అన్నీ అసత్యమని.. వాటికి కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో ఆమె క్షమాపణలు చెప్పకపోతే చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తానని కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.