తెలంగాణలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీలకు టీఏఎఫ్ఆర్సీ కొత్త ఫీజులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈసారి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో కేవలం ట్యూషన్ ఫీజును మాత్రమే అనుమతించి, గతంలో వసూలు చేసే రూ. 8,500 అదనపు 'స్పెషల్ ఫీజు'ను తొలగించడం కాలేజీ యాజమాన్యాలకు షాక్కు గురయ్యేలా చేసింది. అడ్మిషన్, లైబ్రరీ, ల్యాబ్ వంటి పేర్లతో ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో విద్యార్థులకు భారం తగ్గనుంది.