తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ లిస్ట్ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ జాబితాలో తమ పేరు ఉందో లేదో అని.. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే ఎన్నికల అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు.