రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల జాబితాపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలోనే ఉందని ఆరోపించారు. సీఎం పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 22ఏ జాబితాలో ఆస్తులను ఎందుకు చేర్చారో సమగ్ర విచారణ జరిపించాలని.. ఎన్ని ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.