హనుమాన్ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లో శనివారం ఉదయం 6 నుండి మరుసటి రోజు ఉదయం 6 వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. వీర హనుమాన్ శోభాయాత్రల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.