మదనపల్లె బాలిక హత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం పోలీసులు కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఈ విషయంపై టీడీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు.