కడప గడ్డపై తొలిసారిగా జరుగుతున్న మహానాడు అట్టహాసంగా జరుగుతోంది. మే 27న మొదలైన మహానాడు మే 29వ తేదీతో ముగియనుంది. మహానాడులో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో మహానాడుకు వచ్చే కార్యకర్తల కోసం టీడీపీ మహానాడులో భోజనాల ఏర్పాట్లు చేసింది. 10 లక్షల మందికి ఆకలి తీర్చేలా మహానాడులో భోజనాలు సిద్ధం చేశారు. అలాగే 20 రకాల వంటకాలతో మహానాడు మెనూ రెడీ చేశారు. మరోవైపు మహానాడు భోజనాలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.