కడప జిల్లాలో టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. కడపలో మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. అలాగే టీడీపీ కోసం భారీగా విరాళాలు అందించారు. పార్టీకి అందించే విరాళాలను పార్టీ నిర్మాణంతో పాటుగా.. ప్రజలు, కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో తొలి రోజే కార్యకర్తలు, నేతలు భారీగా విరాళాలు అందించారు. ఆన్లైన్లో విరాళాలు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.