Maoists in Vijayawada: విజయవాడలో మావోయిస్టుల కలకలం.. 27 మంది అరెస్ట్.. ఇంటెలిజెన్స్ ఏడీజీ కీలక ప్రకటన

9 months ago 19
విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. న్యూ ఆటోనగర్‌లో 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరంతా పది రోజుల కిందట ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. కూలీ పనుల కోసం వచ్చామని చెప్పి ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఉన్నట్లు తెలిసింది. మరోవైపు విజయవాడ, కాకినాడ కలిపి మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ప్రకటించారు.
Read Entire Article