వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగానూ దీనిపై అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ జగన్ మావిగన్ ప్రతిపాదనపై స్పందించారు. వైఎస్ జగన్కు ఇలాంటి సలహాలు ఇచ్చేవారిని వెంటపడి తన్నాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆలోచన మంచిదేనని.. కానీ సమయమే సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.