తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. నిజాయితీగా పనిచేసే నాయకులు తనకు మద్దతుగా నిలిస్తే తమిళనాడు తరహాలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు తీసుకురాగలమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు లభిస్తున్నాయని.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.