హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్తో గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీ ఇప్పుడు వెండితెరపైకి అడుగుపెడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన పాంచాలి పంచభర్తృక సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఆమె ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. థియేటర్లో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ టికెట్ను కుమారి ఆంటీ వద్ద చూపిస్తే ఫుడ్ బిల్లుపై రూ.100 డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు.