అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో కనిపిస్తున్న ప్రత్యేకమైన ‘S’ ఆకారపు మలుపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వంపు ఎలాంటి ఆకస్మిక మార్పు కాదని.. భవిష్యత్లో రోడ్ల అనుసంధానాలు, ఎలివేటెడ్ కారిడార్, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రణాళికలో భాగమని స్పష్టం చేసింది. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు ప్రతిపాదిత కారిడార్తో పాటు ఎన్హెచ్-16 కనెక్టివిటీని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.