MBU University: మోహన్ బాబు యూనివర్సిటికీ జరిమానా.. మంచు విష్ణు కీలక ప్రకటన

5 months ago 7
మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రూ.15 లక్షలు జరిమానా విధించిన విషయంపై యూనివర్సిటీ ప్రో - ఛాన్సలర్ మంచు విష్ణు కీలక ప్రకటన విడుదల చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు, అటెండెన్స్ నిర్వహణలో లోపాలు, సర్టిఫికేట్ల నిలిపివేత వంటి ఆరోపణలపై విచారించిన కమిషన్ రూ.15 లక్షలు జరిమానా విధించడంతో పాటుగా రూ.26 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. వాటిని పోర్టల్‌లో ఉంచింది. అయితే కమిషన్ చేసినవి కేవలం సిఫార్సులు మాత్రమేనన్న మంచు విష్ణు.. హైకోర్టులో విచారణలో ఉన్న అంశం మీద ఇలా పోర్టల్‌లో పెట్టడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి నిరాధార వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
Read Entire Article