మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితుడు శ్రవణ్ కుమార్ బెయిల్పై విడుదలయ్యాక కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటే కష్టాలేనని, ప్రేమ అనేది ఆకర్షణ మాత్రమేనని అన్నారు. అమృత పోస్ట్పై స్పందిస్తూ.. తప్పు చేస్తే మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధమని తెలిపారు. తల్లిదండ్రుల ప్రేమను మించినది ఈ భూమ్మీద లేదని చెప్తూ.. ఒకవేళ ప్రేమిస్తే.. ఆ ప్రేమని నిలబెట్టుకోవడం ఏం చేయాలో చెప్పుకొచ్చారు శ్రవణ్ కుమార్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..