హైదరాబాద్ ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం ఘటన కేసును పోలీసులు చేధించారు. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడిని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడు మేడ్చల్ జిల్లాకు చెందిన జంగం మహేష్గా గుర్తించారు. గంజాయికి బానిసైన మహేష్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు బాధితురాలు నిందితుడిని గుర్తించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.