ఏపీని మొంథా తుపాను వణికిస్తోంది. తీరం వైపు దూసుకువస్తోంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 27 నుంచి 29వ తేదీ వరకూ మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేసింది. విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.