ఆ ఇద్దరూ భార్యభర్తలు.. సంసార జీవతం అంతా సాఫీగానే సాగుతోంది. ఆమె కాంట్రాక్ట్ ఉద్యోగి కావడంతో పర్మినెంట్ చేయిస్తామంటూ భర్త తరఫు బంధువులు చెప్పారు. అయితే, కాస్తంత ఖర్చు అవుతుంది అనేసరికి ఏదోలా చేసి డబ్బులు అరేంజ్ చేశారు. కానీ.. కొద్దిరోజులకే భర్త తరఫు బంధువులు మోసం చేశారని భార్య తెలుసుకుంది. ఈ కారణంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అది ముదిరి ఇప్పుడు ఏకంగా యాసిడ్ దాడి వరకూ వెళ్లింది. ఈ ఘటన డాక్టర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చోటుచేసుకుంది.