నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం వద్ద కారు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఐదుగురు వైద్య విద్యార్థులు ఉండటం కలచివేస్తోంది. స్నేహితుడి అక్క నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు అతి వేగం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.