తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని దాని కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈనెల 21 వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.