పోస్టల్ స్టాంపులు సేకరించే అభిరుచి ఉన్న విద్యార్థులకు అద్భుత అవకాశం. అలాంటి అభిరుచే ఇప్పుడు వారికి ఉపకార వేతనాలు అందించే అవకాశం కల్పిస్తోంది. దీన్ దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో తపాలా శాఖ ఉపకార వేతనాలు అందించేందుకు కాంపిటీషన్ నిర్వహిస్తోంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 16తో ముగియనుంది. మిగతా వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.