రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వేగం పెంచేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. వచ్చే వారం నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచుతామని చెప్పారు. మరోవైపు ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు.