తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఓటర్ల వెరిఫికేషన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల జాబితా ఈ సర్ ఆధారంగా విడుదల చేయట్లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. సమయం తక్కువగా ఉన్న కారణంగా 2025 నాటి ప్రత్యేక సంక్షిప్త సవరణ ఆధారంగా ఓటర్ల జాబితాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రానికి కావాల్సిన అదనపు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి కోసం ఇతర రాష్ట్రాలను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంప్రదించింది.