సొంత బావమరిది పేరు మీద రూ. కోటి ఆస్తి రిజిస్ట్రేషన్ చేశారో మండల వ్యవసాయాధికారి. దాంతో పాటు కొంత డబ్బు కూడా అప్పుగా ఇచ్చారు. కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆ ఇచ్చిన వాటిని తిరిగి ఇవ్వమనే సరికి బావమరిదికి దుర్భుద్ధి పుట్టింది. దైవ దర్శనానికి వెళ్లొద్దామని చెప్పి మార్గమధ్యంలో కుక్కల్ని చంపే ఇంజెక్షన్లు వేసి ఏఓను హతమార్చారు. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా అందరి సమక్షంలోనే దహనం చేశారు. కానీ.. ఆస్తి పంపకాల్లో మాటా మాటా రావడంతో ఏఓ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసలు నిజం బయటపడింది.