New Districts in AP: అన్నమయ్య జిల్లా ఉంటుంది.. రెవెన్యూ మంత్రి కీలక ప్రకటన..

2 months ago 4
ఏపీలో ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ హయాంలో చేపట్టిన జిల్లాల పునర్విభజన పారదర్శకంగా లేదనే ఉద్దేశంతో.. ఏపీలోని టీడీపీ కూటమి సర్కారు వీటిని మరోసారి సమీక్షించింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ ప్రతిపాదనలకు సోమవారం ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో మార్కాపురం, రంపచోడవరం, మదనపల్లె జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అయితే అన్నమయ్య జిల్లా అస్థిత్వంపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో కేబినెట్ భేటీ అనంతరం ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వీటికి క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article