ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం రూ.3000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. గతంలో సమ్మె చేసినప్పుడు డిసెంబర్ నెలాఖరుకు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. మార్చి 31 వచ్చినా చెల్లించలేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.