Kolikapudi Srinivasa Rao Sigachi Blast: హైదరాబాద్ శివారులోని సిగాచీ ఫ్యాక్టరీ పేలుడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న నిఖిల్ రెడ్డి, శ్రీ రమ్య అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటను పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే విధి వక్రీకరించడంతో వారి జీవితం విషాదంగా ముగిసింది. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.