ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు అండగా నిలిచారు. తన జీతం నుంచి ప్రతి నెలా వారికి ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అలాగే ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ చిన్నారుల చదువుల బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించారు.