పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. జయసూర్య వ్యవహార శైలి మీద పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని నివేదిక సమర్పించాలని ఆదేశించారు కూడా. భీమవరం డీఎస్పీ జయసూర్య గురించి పవన్ కళ్యాణ్ వద్దకు ఇటీవల తరుచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్.. ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి మీద నివేదిక కోరారు. అటు ఈ విషయాన్ని హోం మంత్రి, డీజీపీలకు చేరవేయాలని కార్యాలయం అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.