కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్న జిల్లాలలో ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను శనివారం నుంచి అమల్లోకి తెచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద ఏపీలోని అన్నమయ్య, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి జిల్లాలను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 100 జిల్లాలను ఎంపిక చేయగా.. అందులో నాలుగు ఏపీ నుంచి ఉన్నాయి.