హైదరాబాద్ను అగ్రగామి డిజిటల్ హబ్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి 'డేటా సెంటర్ సిటీ' ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నగర శివారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలో 1500 ఎకరాల్లో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ కేంద్రాలకు అవసరమైన భారీ విద్యుత్, నీటి అవసరాల కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో శుద్ధి చేసిన మురుగునీటిని సరఫరా చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నారు.