తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం మంగళవారం లభ్యమైంది.. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఆయన సన్నిహితులు, పాస్టర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి హైదరాబాద్ తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు