హైడ్రా మరో భారీ ఆపరేషన్ నిర్వహించి అత్తాపూర్లోని రాంబాగ్ పరిధిలో రూ.500 కోట్ల విలువైన 6,427 గజాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అలాగే, చందానగర్లోని భవానీపురంలో కబ్జాకు గురవుతున్న రూ.2 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కూడా కాపాడి స్థానికులకు అప్పగించింది.