తెలంగాణలో పోలియో తిరిగి రాకుండా చూసేందుకు.. అక్టోబర్ 12న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా ఆరు జిల్లాల్లో ప్రత్యేక పల్స్ పోలియో టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. పోలియో కేసులు నమోదవుతున్న పొరుగు దేశాల నుంచి రాకపోకలు ఉన్నందున.. ఐదేళ్ల లోపు ఉన్న దాదాపు 17.5 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2011 నుంచి భారతదేశం పోలియో రహితంగా ఉంది.. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించి.. దేశం సురక్షిత స్థితిని కొనసాగించాలని ఆరోగ్య శాఖ కోరింది.