సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా అనేక రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించడంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. చర్లపల్లికి చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లించిన రైళ్ల వివరాలు సరిగా తెలియకపోవడం కూడా ప్రయాణికులకు సమస్యగా మారింది. చర్లపల్లికి చేరేందుకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సరిగ్గా లేకపోవడంతో.. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని.. దీని వల్ల అదనపు వ్యయ భారం పడుతుందని ఆవేదం చెందుతున్నారు.