హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఇంకా ఖరారు కాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, డిసెంబరు నాటికి అలైన్మెంట్ పూర్తి చేసి, ముఖ్యమంత్రితో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల అంగీకారం లేకుండా పనులు ప్రారంభించబోమని ఆయన తెలిపారు.