హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో వంద మందికి పైగా నామినేషన్లు వేసి తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలని యోచిస్తున్నారు. తమ భూములను కాపాడుకోవడానికి, పరిహారం కోసం వారు ఈ అడుగు వేస్తున్నారు.