తెలంగాణ రైతులకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం త్వరలో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ కానుంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనన్నారు. అంతేకాదు, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.