ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లా్లలో బుధవారం పాఠశాలలకు శెలవు ప్రకటించారు.