ఏపీలోని స్కూలు విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త. ఈ నెలలో వరుస సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ఇచ్చింది. దీంతో ఆదివారం, సోమవారం కలిపి వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చినట్టైంది. మరోవైపు శనివారం కూడా సెలవు ఉండాల్సింది. రెండో శనివారం కారణంతో సెలవు ఉండగా.. ఇటీవల వరదల నేపథ్యంలో స్కూళ్లకు తరుచుగా సెలవులు ప్రకటించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని రెండో శనివారం అయినప్పటికీ తరగతులు నిర్వహించారు.