chemical factory explosion in Sangareddy: హైదరాబాద్ శివారులోని పాశమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు సంభవించి 36 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. దాదాపు 40 మంది కార్మికులు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ భారీ వర్షం అడ్డంకిగా మారింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల కార్మికులే కావడంతో విషాదం మరింత తీవ్రమైంది.