మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య మృతి కేసులో ఆయనపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసును కొట్టివేయాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, తదుపరి చర్యలను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో వైఎస్ జగన్తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా ఉన్నారు.