ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా తెలంగాణలోని 92.87 లక్షల మంది ఓటర్లకు నేటి నుంచి దశలవారీగా నోటీసులు అందించనున్నారు. వీరిలో 60.51 లక్షలు అనామలీస్, 32.36 లక్షలు అన్-మ్యాపింగ్ కేటగిరీల్లో ఉన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు అందించి, వివరాలను యాప్లో నమోదు చేస్తారు. నిర్ణీత తేదీ, సమయంలో ఓటర్లు ఈఆర్వో, ఏఈఆర్వో ఎదుట ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. నోటీసు వచ్చినంత మాత్రాన ఓటు తొలగదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.