ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో తాజాగా మరో మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో రెస్క్యూ సిబ్బంది ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. నెల రోజుల క్రితం టన్నెల్లో 8 మంది బాధితులు చిక్కుకోగా.. ఇటీవల వ్యక్తి డెడ్ బాడీని వెలికి తీశారు. ఇంకా ఏడుగురి మృతదేహాలు అందులోనే ఉండగా.. తాజాగా ఒకర్ని గుర్తించినట్లు తెలిసింది.