నాగర్ కర్నూల్ జిల్లా SLBC సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభ్యం కాగా.. మరో ఏడుగురి ఆచూకీ లభించటం లేదు. ఇలాంటి సమయంలో టన్నెల్ ప్రమాద ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన ఏడు నిమిషాల్లోనే అందులో చిక్కుకున్న వారు చనిపోయినట్లు తెలిసింది.