శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్. మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు ఇకపై ఆన్లైన్లో! లభించనున్నాయి. భక్తుల సౌకర్యం కోసం శ్రీశైలం దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉచిత స్పర్శ దర్శనం టోకెన్ల కోసం ఇక క్యూ లైన్లు అవసరం లేదు. ఆధార్ కార్డు సాయంతో దేవస్థానం అధికారిక వెబ్ సైట్ సందర్శించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టోకెన్లు పొందిన భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం కల్పిస్తారు.