టీడీపీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమంలో జలీల్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయినట్లు తెలిసింది. దీంతో టీడీపీ శ్రేణులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు మే 27వ తేదీ మొదలైన టీడీపీ మహానాడు కార్యక్రమం.. నేటితో ( మే 29) ముగియనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.