Kakarla Brothers Suspended From TDP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రూపు రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తున్నారని కాకర్ల సోదరులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జేసీ ప్రకటించారు. అయితే తమను సస్పెండ్ చేసే అధికారం జేసీకి లేదని కాకర్ల రంగనాథ్ అంటున్నారట. తాడిపత్రిలో జేసీ వర్సెస్ కాకర్ల బ్రదర్స్ వార్ ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం పార్టీలో కలకలం రేపింది.